Andhra Cricket Team: రంజీ క్వార్టర్స్లో ఆంధ్ర.. డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ ఔట్!
- రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించిన ఆంధ్ర జట్టు
- బోనస్ పాయింట్ల ఆధారంగా నాకౌట్కు చేరిన ఆంధ్ర
- ఆంధ్ర దెబ్బకు ఇంటిబాట పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ
- క్వార్టర్స్లో బెంగాల్తో తలపడనున్న ఆంధ్ర
- కర్ణాటక, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ కూడా క్వార్టర్స్లోకి ఎంట్రీ
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఆంధ్ర క్రికెట్ జట్టు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన ఏడో రౌండ్ లీగ్ మ్యాచ్ల చివరి రోజున అనుకూల ఫలితంతో క్వార్టర్ ఫైనల్స్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. క్వార్టర్స్లో ఆంధ్ర జట్టు బెంగాల్తో తలపడనుంది.
గ్రూప్-ఏలో ఝార్ఖండ్, ఆంధ్ర, డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ 31 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే, ఎక్కువ బోనస్ పాయింట్ల విజయాలు సాధించిన జట్లను పరిగణనలోకి తీసుకోవడంతో ఝార్ఖండ్ (3), ఆంధ్ర (2) క్వార్టర్స్కు అర్హత సాధించాయి. కేవలం ఒకే బోనస్ పాయింట్ విజయం సాధించిన విదర్భ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. లీగ్ దశలో ఆంధ్ర చేతిలో ఎదురైన ఓటమే విదర్భ కొంపముంచింది. దీంతో ఈ సీజన్లో కొత్త రంజీ ఛాంపియన్ రావడం ఖాయమైంది.
మరోవైపు, గ్రూప్-బి నుంచి కర్ణాటక అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్లో అడుగుపెట్టింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ దేవదత్ పడిక్కల్ కేవలం 85 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచి, జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో సౌరాష్ట్ర నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి.
ఆంధ్ర, కర్ణాటకతో పాటు ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ కూడా క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి.
ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వార్టర్ ఫైనల్-3లో ఆంధ్ర జట్టు బెంగాల్ను ఢీకొట్టనుంది. మిగతా మ్యాచ్లలో ఝార్ఖండ్-ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్-జమ్మూ కశ్మీర్, ముంబై-కర్ణాటక తలపడనున్నాయి.
గ్రూప్-ఏలో ఝార్ఖండ్, ఆంధ్ర, డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ 31 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే, ఎక్కువ బోనస్ పాయింట్ల విజయాలు సాధించిన జట్లను పరిగణనలోకి తీసుకోవడంతో ఝార్ఖండ్ (3), ఆంధ్ర (2) క్వార్టర్స్కు అర్హత సాధించాయి. కేవలం ఒకే బోనస్ పాయింట్ విజయం సాధించిన విదర్భ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. లీగ్ దశలో ఆంధ్ర చేతిలో ఎదురైన ఓటమే విదర్భ కొంపముంచింది. దీంతో ఈ సీజన్లో కొత్త రంజీ ఛాంపియన్ రావడం ఖాయమైంది.
మరోవైపు, గ్రూప్-బి నుంచి కర్ణాటక అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్లో అడుగుపెట్టింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ దేవదత్ పడిక్కల్ కేవలం 85 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచి, జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో సౌరాష్ట్ర నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి.
ఆంధ్ర, కర్ణాటకతో పాటు ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ కూడా క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి.
ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వార్టర్ ఫైనల్-3లో ఆంధ్ర జట్టు బెంగాల్ను ఢీకొట్టనుంది. మిగతా మ్యాచ్లలో ఝార్ఖండ్-ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్-జమ్మూ కశ్మీర్, ముంబై-కర్ణాటక తలపడనున్నాయి.