Jishnu Dev Varma: వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే బాధ్యత వారి పైనే ఉంది: తెలంగాణ గవర్నర్

Telangana Governor says youth responsible for Viksit Bharat 2047
  • ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువతదే కీలక పాత్ర అని వ్యాఖ్య
  • అభివృద్ధి, వారసత్వం కలిసి ఉంటేనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని వ్యాఖ్య
  • తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న గవర్నర్
వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే బాధ్యత జనరేషన్ జడ్‌పైనే ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జైపూర్‌లో నిర్వహించిన యువ సంసద్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువతదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. నేటి యువతకు ఎంతో అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధి, వారసత్వం కలిసి ఉంటేనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో రాణిస్తూనే భారతీయ విలువలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. యువతలో జాతీయతా భావం పెంపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వారు మొబైల్ స్క్రీన్‌పై కాకుండా సంసద్ వంటి వేదికలపై పాల్గొనేలా ప్రోత్సహించాలని అన్నారు.

ప్రజాస్వామ్య విలువలు వారికి తెలియజేయాలని సూచించారు. నేడు వారు కన్న కలలే భారతదేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. సన్మార్గంలో నడవడం, దేశమే ముందు అనే స్ఫూర్తిని వారిలో రగిలించడం ముఖ్యమని అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడుతూ, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. జన్ జెడ్ రాష్ట్రానికి ప్రధాన బలమని పేర్కొన్నారు.
Jishnu Dev Varma
Viksit Bharat 2047
Telangana Governor
Generation Z
Indian youth
Narendra Modi
ETV Bharat
Yuva Sansad
Jaipur
Indian values

More Telugu News