TSPSC: టీజీపీఎస్సీకి హైకోర్టు షాక్.. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు
- గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేసిన హైకోర్టు
- పునఃమూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు
- సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే మూల్యాంకనం జరపాలని స్పష్టీకరణ
- ప్రక్రియ పూర్తికి 8 నెలల గడువు విధించిన న్యాయస్థానం
- లేనిపక్షంలో మెయిన్స్ పరీక్ష రద్దు తప్పదని హెచ్చరిక
తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్-1 మూల్యాంకనంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మార్చి 10న టీఎస్పీఎస్సీ విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను, మార్కుల లిస్టును రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
గ్రూప్-1 సమాధాన పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పునఃమూల్యాంకనం తప్పనిసరిగా సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఒకవేళ నిర్దేశిత సమయంలోగా పునఃమూల్యాంకనం పూర్తి చేయని పక్షంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలనే రద్దు చేయాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.
గ్రూప్-1 మూల్యాంకనంలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు.. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ చివరి దశలో ఉందని, నియామకాలను రద్దు చేయవద్దని ఎంపికైన మరికొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై జులై 7న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇరుపక్షాల వాదనలు విన్నారు. వాదనలు ముగిసిన అనంతరం, న్యాయస్థానం తాజాగా ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో గ్రూప్-1 అభ్యర్థులలో మళ్లీ ఉత్కంఠ నెలకొంది.
గ్రూప్-1 సమాధాన పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పునఃమూల్యాంకనం తప్పనిసరిగా సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఒకవేళ నిర్దేశిత సమయంలోగా పునఃమూల్యాంకనం పూర్తి చేయని పక్షంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలనే రద్దు చేయాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.
గ్రూప్-1 మూల్యాంకనంలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు.. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ చివరి దశలో ఉందని, నియామకాలను రద్దు చేయవద్దని ఎంపికైన మరికొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై జులై 7న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇరుపక్షాల వాదనలు విన్నారు. వాదనలు ముగిసిన అనంతరం, న్యాయస్థానం తాజాగా ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో గ్రూప్-1 అభ్యర్థులలో మళ్లీ ఉత్కంఠ నెలకొంది.