భర్త శవం వద్ద భార్య ప్రియుడు.. వీడియో ఇదిగో!
- ఇండోర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు!
- రాజా అంత్యక్రియల్లో సోనమ్ తండ్రికి హంతకుడి ఓదార్పు
- మేఘాలయ హనీమూన్లో రాజా రఘువంశీ దారుణ హత్య
- రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ప్రధాన సూత్రధారులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ హత్యకు సుపారీ ఇచ్చిన సోనమ్ రఘువంశీ నిన్న పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాను అమాయకురాలినని, భర్త హత్యలో తనకెలాంటి పాత్ర లేదని సోనమ్ పోలీసుల విచారణలో వెల్లడించింది. సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా, అతడి స్నేహితులు ముగ్గురు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.
కాగా, రాజా రఘువంశీ మృతదేహం ఈ నెల 2న లభ్యం కాగా.. ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇండోర్ కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు సోనమ్ తల్లిదండ్రులు తమ దగ్గరి బంధువులతో కలిసి హాజరయ్యారు. రాజా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా.. ఆమె తండ్రిని ఓదార్చుతూ కనిపించడం గమనార్హం. రాజా రఘువంశీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో సోనమ్ తండ్రిని రాజ్ కుశ్వాహా ఓదార్చడం కనిపించింది.
వివరాల్లోకి వెళితే.. హనీమూన్ కోసం మే 23న మేఘాలయ వెళ్లిన రాజా, సోనమ్ దంపతులు అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమైంది. సోనమ్ ఆచూకీ లభించలేదు. వారం రోజుల తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసులకు పట్టుబడింది. మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజాను హత్య చేసేందుకు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ప్లాన్ చేసి వికాశ్, ఆనంద్, ఆకాశ్ అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టి, ఈ ముగ్గురు కిల్లర్లను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో అరెస్ట్ చేశారు.
కాగా, రాజా రఘువంశీ మృతదేహం ఈ నెల 2న లభ్యం కాగా.. ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇండోర్ కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు సోనమ్ తల్లిదండ్రులు తమ దగ్గరి బంధువులతో కలిసి హాజరయ్యారు. రాజా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా.. ఆమె తండ్రిని ఓదార్చుతూ కనిపించడం గమనార్హం. రాజా రఘువంశీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో సోనమ్ తండ్రిని రాజ్ కుశ్వాహా ఓదార్చడం కనిపించింది.
వివరాల్లోకి వెళితే.. హనీమూన్ కోసం మే 23న మేఘాలయ వెళ్లిన రాజా, సోనమ్ దంపతులు అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమైంది. సోనమ్ ఆచూకీ లభించలేదు. వారం రోజుల తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసులకు పట్టుబడింది. మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజాను హత్య చేసేందుకు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ప్లాన్ చేసి వికాశ్, ఆనంద్, ఆకాశ్ అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టి, ఈ ముగ్గురు కిల్లర్లను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో అరెస్ట్ చేశారు.
More Telugu News
సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు!
![]()
ఇరాన్ నన్ను హత్య చేయాలని చూస్తోంది: ట్రంప్ సంచలన ఆరోపణలు
![]()
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన.. సంయమనం పాటించాలని పిలుపు
![]()
హోటల్ బెడ్పై కాళ్లవైపు రంగురంగుల వస్త్రం ఎందుకు వేస్తారు? అసలు కారణం ఇదే!
![]()
పుట్టినరోజున గంగూలీకి అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో 'దాదా'!
![]()
పాప్కార్న్ ఎందుకు పేలుతుంది? మీకు ఇష్టమైన స్నాక్ వెనుక దాగిన సైన్స్ ఇదే!
![]()
ఈ ఉచిత పథకాలు ఎవరడిగారు?: తెలంగాణ సర్కార్పై హైకోర్టు ఆగ్రహం
![]()
'కలర్స్' స్వాతి రెండో పెళ్లి.. తన డైరెక్టర్తోనే ఏడడుగులు!
![]()
ఏపీ విద్యార్థులకు శుభవార్త.. డైట్ ఛార్జీలు 10% పెంపు
![]()
గగన్యాన్ దిశగా మరో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష విజయవంతం
![]()
‘ఒక్కసారి పాడమ్మా.. డ్యాన్స్ చేయమ్మా’.. పిల్లలను ఇలా బలవంతం చేస్తున్నారా?
![]()
కువైట్లో తెలంగాణ యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు
![]()
ఉద్యోగం మానేశాక అతనికి నెలకు 1.8 లక్షలు... సక్సెస్ సీక్రెట్ ఇదే!
![]()
భారత్లో బీఎండబ్ల్యూ రికార్డు అమ్మకాలు.. ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్
![]()
రూ.55కే 1,000కిపైగా టీవీ ఛానళ్లు.. జియో సూపర్ ప్లాన్
![]()