లార్డ్స్ మైదానంలో టీమిండియా ప్రాక్టీస్... ఆసీస్ క్రికెటర్లకు నో ఎంట్రీ!

Team India Practice at Lords Australia Denied Entry
షార్ట్స్‌లో చూడండి
ప్రతిష్ఠాత్మక ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఊహించని అడ్డంకి ఎదురైంది. ఫైనల్ మ్యాచ్ జరగనున్న ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయడానికి ఆస్ట్రేలియా జట్టుకు అనుమతి లభించలేదు. అందుకు కారణం, అదే సమయంలో లార్డ్స్ మైదానంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తూ ఉండడమే. టీమిండియా... జూన్ 20 నుంచి ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతుండడం తెలిసిందే. అటు, ఆస్ట్రేలియా జట్టు జూన్ 11న దక్షిణాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్ సమరానికి సిద్ధమవుతోంది.

లార్డ్స్‌లోని ట్రైనింగ్ గ్రౌండ్ అందుబాటులో లేదని ఆస్ట్రేలియా జట్టుకు నిర్వాహకులు తెలిపారు. పాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టుకు అనుమతి ఎందుకు నిరాకరించారనే దానిపై కచ్చితమైన కారణాలు వెల్లడి కాలేదు. అయితే, ఆసక్తికరంగా, అదే సమయంలో భారత క్రికెట్ జట్టు సభ్యులు లార్డ్స్‌లోనే ప్రాక్టీస్ చేస్తుండటం గమనార్హం. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత జట్టుకు శిక్షణకు అనుమతి లభించడం, ఆస్ట్రేలియాను మాత్రం కాదనడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.


Go Back to Shorts
Team India
India vs England
WTC Final
World Test Championship
Lords Cricket Ground
Pat Cummins
Australia Cricket Team
South Africa
Cricket
Test Series

More Telugu News