ప్రధానిపై దూషణలు: బాలికను క్షమించిన మోదీ.. 'జీవనదానం' ఇచ్చారన్న తల్లి
- తప్పు ఒప్పుకుంటూ, క్షమించమని వేడుకుంటూ బాలిక వీడియో విడుదల
- తనపై దూషణలకు పాల్పడిన బాలికను క్షమించిన మోదీ
- బాలికపై నమోదైన ఎఫ్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని కుటుంబం విజ్ఞప్తి
- కేవలం రీల్లోనే క్షమిస్తారా, కేసులు కూడా వెనక్కి తీసుకుంటారా అని సీజేపీ నేత ప్రశ్న
ఓ నిరసన కార్యక్రమంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి వైరల్ అయిన బాలికను.. మోదీ క్షమించడంపై ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ తన కుమార్తెకు ఒక ‘కొత్త జీవితాన్ని’ ప్రసాదించారని పేర్కొన్నారు. ప్రతీకార చర్యకు బదులుగా క్షమాగుణాన్ని ప్రదర్శించినందుకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.
"ఇంతటి అసభ్యకరమైన పదాలు వాడిన నా బిడ్డను క్షమించి మోదీ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ రోజు తన పుట్టినరోజు. ఈ సందర్భంగా నా బిడ్డకు మోదీ 'జీవనదానం' అనే గొప్ప బహుమతి ఇచ్చారు. ఈ రోజు నుంచి ఈ అమ్మాయికి ఇది పునర్జన్మ" అని ఆమె తెలిపారు.
నీట్-యూజీ పేపర్ లీక్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఓ బాలిక ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై ప్రధాని మోదీ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. తనపై దూషణలకు పాల్పడిన వారిని 'మార్గం తప్పిన వారు'గా అభివర్ణించారు. ఆగ్రహం లేదా ప్రతీకారంతో దీనికి సమాధానం ఇవ్వలేమని స్పష్టం చేశారు.
ప్రధాని స్పందన తర్వాత, ఆ బాలిక క్షమాపణ చెబుతున్న వీడియో కూడా ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. తన వయసు 15 ఏళ్లని, తాను చేసిన తప్పు తీవ్రతను గ్రహించానని అందులో పేర్కొంది. "నేను చేసిన పని క్షమించరానిది. చాలా తప్పుడు మాటలు మాట్లాడాను. నన్ను నేను చూసుకోవడానికే సిగ్గుగా ఉంది" అని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. స్నేహితులతో కలిసి నిరసన వద్దకు వెళ్లినప్పుడు, అక్కడి వారిని చూసి ప్రభావితమై అలా మాట్లాడానని, ఇదే తన మొదటి, చివరి తప్పిదమని, దేశం మొత్తం నన్ను క్షమించాలని వేడుకుంది.
జులై 23న జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు ఆధారంగా నోయిడా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దానిని న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. బాలిక వ్యాఖ్యలు ప్రధాని పదవి గౌరవానికి భంగం కలిగించాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వయసును 15 ఏళ్లకు బదులుగా 25 ఏళ్లుగా తప్పుగా నమోదు చేశారని ఆమె తల్లి ఆరోపించారు.
ఈ సందర్భంగా, 20 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను నిషేధించాలని, మైనర్లను నిరసనలకు దూరంగా ఉంచాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ఇన్స్టాగ్రామ్ వీడియోపై స్పందిస్తూ.. "కేవలం రీల్లోనే క్షమిస్తారా? లేక కేసులు కూడా వెనక్కి తీసుకుంటారా?" అని ప్రశ్నించారు.
"ఇంతటి అసభ్యకరమైన పదాలు వాడిన నా బిడ్డను క్షమించి మోదీ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ రోజు తన పుట్టినరోజు. ఈ సందర్భంగా నా బిడ్డకు మోదీ 'జీవనదానం' అనే గొప్ప బహుమతి ఇచ్చారు. ఈ రోజు నుంచి ఈ అమ్మాయికి ఇది పునర్జన్మ" అని ఆమె తెలిపారు.
నీట్-యూజీ పేపర్ లీక్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఓ బాలిక ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై ప్రధాని మోదీ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. తనపై దూషణలకు పాల్పడిన వారిని 'మార్గం తప్పిన వారు'గా అభివర్ణించారు. ఆగ్రహం లేదా ప్రతీకారంతో దీనికి సమాధానం ఇవ్వలేమని స్పష్టం చేశారు.
ప్రధాని స్పందన తర్వాత, ఆ బాలిక క్షమాపణ చెబుతున్న వీడియో కూడా ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. తన వయసు 15 ఏళ్లని, తాను చేసిన తప్పు తీవ్రతను గ్రహించానని అందులో పేర్కొంది. "నేను చేసిన పని క్షమించరానిది. చాలా తప్పుడు మాటలు మాట్లాడాను. నన్ను నేను చూసుకోవడానికే సిగ్గుగా ఉంది" అని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. స్నేహితులతో కలిసి నిరసన వద్దకు వెళ్లినప్పుడు, అక్కడి వారిని చూసి ప్రభావితమై అలా మాట్లాడానని, ఇదే తన మొదటి, చివరి తప్పిదమని, దేశం మొత్తం నన్ను క్షమించాలని వేడుకుంది.
జులై 23న జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు ఆధారంగా నోయిడా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దానిని న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. బాలిక వ్యాఖ్యలు ప్రధాని పదవి గౌరవానికి భంగం కలిగించాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వయసును 15 ఏళ్లకు బదులుగా 25 ఏళ్లుగా తప్పుగా నమోదు చేశారని ఆమె తల్లి ఆరోపించారు.
ఈ సందర్భంగా, 20 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను నిషేధించాలని, మైనర్లను నిరసనలకు దూరంగా ఉంచాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ఇన్స్టాగ్రామ్ వీడియోపై స్పందిస్తూ.. "కేవలం రీల్లోనే క్షమిస్తారా? లేక కేసులు కూడా వెనక్కి తీసుకుంటారా?" అని ప్రశ్నించారు.