1971 నాటి యుద్ధానికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పహల్గామ్ ఘటనపై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని

Shehbaz Sharif Claims Revenge for 1971 War After Pahalgam Attack
షార్ట్స్‌లో చూడండి
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను దురదృష్టకరమని చెబుతూనే, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971 యుద్ధంలో ఎదురైన ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధంగా మాట్లాడారు. ఇటీవల భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత ప్రమాదకరమైన మలుపు తీసుకునేదని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ముజఫరాబాద్‌లో మరణించిన వారి కుటుంబ సభ్యులను షెహబాజ్ షరీఫ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ "పహల్గామ్ ఘటన చాలా దురదృష్టకరం. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణమైనా తీవ్ర రూపు దాల్చే పరిస్థితులు నెలకొన్నాయి" అని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని తాము కోరినప్పటికీ, భారత్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని షరీఫ్ ఆరోపించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. 
Go Back to Shorts
Shehbaz Sharif
Pakistan Prime Minister
Pahalgam Terror Attack
India Pakistan Relations
1971 War
Operation Sindoor
Muzaffarabad
Terrorism
Kashmir
Cross Border Terrorism

More Telugu News