Jagan Mohan Reddy: 25 ఎంపీ స్థానాలకు పరిశీలకులను నియమించిన జగన్

- పార్టీ పునర్ నిర్మాణంపై జగన్ ఫోకస్
- ఇప్పటికే పలు మార్పులు, చేర్పులు
- తాజాగా పార్లమెంటు పరిశీలకుల జాబితా విడుదల చేసిన వైసీపీ హైకమాండ్
వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్ నిర్మాణంపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా పార్టీలో సంస్థాగతంగా మార్పులు, చేర్పులు, కొత్త నియామకాలు చేపడుతున్నారు. తాజాగా, ఏపీలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
కొత్తగా నియమితులైన పరిశీలకులు వీరే...
1. శ్రీకాకుళం- కుంభా రవిబాబు
2. విజయనగరం- కిల్లి సత్యనారాయణ
3. అరకు- బొడ్డేటి ప్రసాద్
4. అనకాపల్లి- శోభా హైమావతి
5. విశాఖపట్నం- కదిరి బాబూరావు
6. కాకినాడ- సూర్యనారాయణరాజు
7. అమలాపురం- జక్కంపూడి విజయలక్ష్మి
8. రాజమండ్రి- తిప్పల గురుమూర్తి రెడ్డి
9. నరసాపురం- ముదునూరి మురళీ కృష్ణంరాజు
10. ఏలూరు- వంకా రవీంద్రనాథ్
11. మచిలీపట్నం- జెట్టి గురునాథం
12. విజయవాడ- మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
13. గుంటూరు- పోతిన మహేశ్
14. నరసరావుపేట- డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి
15. బాపట్ల- తూమాటి మాధవరావు
16. ఒంగోలు- బత్తుల బ్రహ్మానందరెడ్డి
17. నెల్లూరు- జంకె వెంకటరెడ్డి
18. తిరుపతి- మేడా రఘునాథరెడ్డి
19. చిత్తూరు- చవ్వా రాజశేఖర రెడ్డి
20. రాజంపేట- కొత్తమద్దిసురేశ్ బాబు
21. కడప- కొండూరు అజయ్ రెడ్డి
22. అనంతపురం- బోరెడ్డి నరేశ్ కుమార్ రెడ్డి
23. హిందూపురం- ఆర్.రమేశ్ రెడ్డి
24. నంద్యాల- కల్పలతా రెడ్డి
25. కర్నూలు- గంగుల ప్రభాకర్ రెడ్డి