పిల్లల్లో పుస్తకాలపై ఆసక్తి పెంచాలా? పేరెంట్స్ తప్పక పాటించాల్సిన 6 అలవాట్లు
- చిన్నారులకు కథలు చదివి వినిపించాలి
- తల్లిదండ్రులు కూడా చదవడం అలవాటు చేసుకోవాలి
- లైబ్రరీలు, బుక్స్టోర్లకు తీసుకెళ్లాలి
- నచ్చిన పుస్తకాలను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి
- పుస్తకాల గురించి పిల్లలతో మాట్లాడాలి
- ప్రశాంతంగా చదివే సమయం కేటాయించాలి
స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ యుగంలో పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. చదవడం వల్ల జ్ఞానం పెరగడమే కాదు.. ఊహాశక్తి, ఏకాగ్రత, భావోద్వేగ పరిపక్వత, ఆలోచనా సామర్థ్యం కూడా మెరుగవుతాయి. అయితే పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వడం ఒక్కటే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో చదవడం సహజమైన అలవాటుగా మారే వాతావరణాన్ని కల్పిస్తేనే పిల్లల్లో పుస్తకాలపై ప్రేమ పెరుగుతుందని సూచిస్తున్నారు.
1. కథలు చదివి వినిపించాలి
పిల్లలు చదవడం నేర్చుకున్నాక చాలామంది తల్లిదండ్రులు కథలు చదివి వినిపించడం మానేస్తారు. కానీ చిన్నప్పటిలాగే పెద్దయ్యాక కూడా అప్పుడప్పుడు కథలు చదివి వినిపిస్తే వారి ఊహాశక్తి, భాషా నైపుణ్యాలు, కథలపై ఆసక్తి మరింత పెరుగుతాయి.
2. మీరు కూడా పుస్తకాలు చదవండి
పిల్లలు చెప్పినదానికంటే చూసినదే ఎక్కువగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పుస్తకం, నవల లేదా వార్తాపత్రిక చదువుతుంటే.. చదవడం అనేది సహజమైన రోజువారీ అలవాటు అని పిల్లలకు అనిపిస్తుంది.
3. లైబ్రరీలు, బుక్స్టోర్లకు తీసుకెళ్లండి
వీలైనప్పుడల్లా పిల్లలను లైబ్రరీలు, పుస్తకాల దుకాణాలకు తీసుకెళ్లండి. అక్కడ వివిధ రకాల పుస్తకాలను చూసే అవకాశం దొరుకుతుంది. ఈ అనుభవం పిల్లల్లో కొత్త పుస్తకాలపై ఆసక్తిని పెంచుతుంది.
4. నచ్చిన పుస్తకాలు వాళ్లే ఎంచుకునేలా చేయండి
చదివే ప్రతి పుస్తకం పాఠ్యపుస్తకం లేదా విజ్ఞానానికి సంబంధించినదే కావాలనే నిబంధన పెట్టొద్దు. కామిక్స్, ఫాంటసీ, కథలు.. ఏది చదవాలనిపిస్తే అది చదవనివ్వండి. చదవాలనే అలవాటు పెరగడమే అసలు లక్ష్యం.
5. పుస్తకాల గురించి మాట్లాడండి
‘‘పుస్తకం పూర్తయిందా?’’ అని అడగడం కంటే.. ‘‘కథ ఎలా ఉంది?’’, ‘‘ఏ పాత్ర నచ్చింది?’’, ‘‘ఏం నేర్చుకున్నావు?’’ వంటి ప్రశ్నలు అడగండి. దీంతో పిల్లల్లో ఆలోచనా శక్తి పెరగడమే కాకుండా తల్లిదండ్రులతో అనుబంధం కూడా బలపడుతుంది.
6. చదివేందుకు ప్రశాంతమైన సమయం ఇవ్వండి
ట్యూషన్లు, క్లాసులు, ఇతర కార్యక్రమాల మధ్య పిల్లలకు కొంత ఖాళీ సమయం ఉండేలా చూడాలి. ఇంట్లో ఓ చిన్న చదివే మూలను ఏర్పాటు చేయడం లేదా నిద్రకు ముందు కొద్దిసేపు పుస్తకం చదివే అలవాటు చేయడం వల్ల పఠనం ఆనందంగా మారుతుంది.
పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు ఒక్క రోజులో రాదు. తల్లిదండ్రులు చూపించే ఆదర్శం, ఇంట్లో ఉండే వాతావరణం, చదవడానికి ఇచ్చే స్వేచ్ఛ.. ఇవే వారిలో పఠనంపై శాశ్వతమైన ఆసక్తిని పెంచే ముఖ్యమైన అంశాలని నిపుణులు చెబుతున్నారు.
1. కథలు చదివి వినిపించాలి
పిల్లలు చదవడం నేర్చుకున్నాక చాలామంది తల్లిదండ్రులు కథలు చదివి వినిపించడం మానేస్తారు. కానీ చిన్నప్పటిలాగే పెద్దయ్యాక కూడా అప్పుడప్పుడు కథలు చదివి వినిపిస్తే వారి ఊహాశక్తి, భాషా నైపుణ్యాలు, కథలపై ఆసక్తి మరింత పెరుగుతాయి.
2. మీరు కూడా పుస్తకాలు చదవండి
పిల్లలు చెప్పినదానికంటే చూసినదే ఎక్కువగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పుస్తకం, నవల లేదా వార్తాపత్రిక చదువుతుంటే.. చదవడం అనేది సహజమైన రోజువారీ అలవాటు అని పిల్లలకు అనిపిస్తుంది.
3. లైబ్రరీలు, బుక్స్టోర్లకు తీసుకెళ్లండి
వీలైనప్పుడల్లా పిల్లలను లైబ్రరీలు, పుస్తకాల దుకాణాలకు తీసుకెళ్లండి. అక్కడ వివిధ రకాల పుస్తకాలను చూసే అవకాశం దొరుకుతుంది. ఈ అనుభవం పిల్లల్లో కొత్త పుస్తకాలపై ఆసక్తిని పెంచుతుంది.
4. నచ్చిన పుస్తకాలు వాళ్లే ఎంచుకునేలా చేయండి
చదివే ప్రతి పుస్తకం పాఠ్యపుస్తకం లేదా విజ్ఞానానికి సంబంధించినదే కావాలనే నిబంధన పెట్టొద్దు. కామిక్స్, ఫాంటసీ, కథలు.. ఏది చదవాలనిపిస్తే అది చదవనివ్వండి. చదవాలనే అలవాటు పెరగడమే అసలు లక్ష్యం.
5. పుస్తకాల గురించి మాట్లాడండి
‘‘పుస్తకం పూర్తయిందా?’’ అని అడగడం కంటే.. ‘‘కథ ఎలా ఉంది?’’, ‘‘ఏ పాత్ర నచ్చింది?’’, ‘‘ఏం నేర్చుకున్నావు?’’ వంటి ప్రశ్నలు అడగండి. దీంతో పిల్లల్లో ఆలోచనా శక్తి పెరగడమే కాకుండా తల్లిదండ్రులతో అనుబంధం కూడా బలపడుతుంది.
6. చదివేందుకు ప్రశాంతమైన సమయం ఇవ్వండి
ట్యూషన్లు, క్లాసులు, ఇతర కార్యక్రమాల మధ్య పిల్లలకు కొంత ఖాళీ సమయం ఉండేలా చూడాలి. ఇంట్లో ఓ చిన్న చదివే మూలను ఏర్పాటు చేయడం లేదా నిద్రకు ముందు కొద్దిసేపు పుస్తకం చదివే అలవాటు చేయడం వల్ల పఠనం ఆనందంగా మారుతుంది.
పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు ఒక్క రోజులో రాదు. తల్లిదండ్రులు చూపించే ఆదర్శం, ఇంట్లో ఉండే వాతావరణం, చదవడానికి ఇచ్చే స్వేచ్ఛ.. ఇవే వారిలో పఠనంపై శాశ్వతమైన ఆసక్తిని పెంచే ముఖ్యమైన అంశాలని నిపుణులు చెబుతున్నారు.