Malla Reddy: కాంగ్రెస్ పార్టీ అణుబాంబులాంటిది: మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy Compares Congress to a Nuclear Bomb

  • కాంగ్రెస్ దృష్టి బీఆర్ఎస్ పై పడిందన్న మల్లారెడ్డి
  • ఆ పార్టీని మటాష్ చేయాల్సిందేనని వ్యాఖ్య
  • జపాన్ సైనికుల మాదిరి మనం పోరాడాలని పిలుపు

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అణుబాంబులాంటిదని... దాని దృష్టి బీఆర్ఎస్ పై పడిందని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని మటాష్ చేయాల్సిందేనని చెప్పారు. కేటీఆర్ అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీ పాలన దారుణంగా ఉందని, ఆ పార్టీని మటాష్ చేయాల్సిందేనని మల్లారెడ్డి చెప్పారు. అణుబాంబులాంటి కాంగ్రెస్ పై జపాన్ సైనికుల మాదిరి మనం పోరాటం చేయాలని అన్నారు. అప్పుడే గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. 

పార్టీ కోసం ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో భవిష్యత్తులో వారికే పదవులు వస్తాయని తెలిపారు. ఈ సమావేశానికి వచ్చిన నేతలు భవిష్యత్తులో ఎంపీలు, మంత్రులు కావచ్చని ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

Malla Reddy
BRS Party
Congress Party
Telangana Politics
KTR
Indian Politics
Viral Comments
Nuclear Bomb Analogy
Political Strategy
Election
  • Loading...

More Telugu News