Mamata: ఉత్తరప్రదేశ్‌లో మరో సంచలనం.. కూతురి మామతో పరారైన నలుగురు పిల్లల తల్లి

Uttar Pradesh Shocker Mother of Four Runs Away with Daughters Father in Law

  • 2022లో కుమార్తెకు పెళ్లి
  • ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త
  • నెలకు ఒకటి రెండుసార్లు మాత్రమే ఇంటికి
  • ఇదే అదునుగా కుమార్తె మామతో వివాహేతర సంబంధం
  • డబ్బులు, నగలు తీసుకుని పరార్

అలీగఢ్‌కు చెందిన మహిళ తన కూతురికి కాబోయే భర్తతో పరారైన ఘటన మరవకముందే, ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో మరో విస్మయకర ఘటన వెలుగులోకి వచ్చింది. మమత అనే 43 ఏళ్ల మహిళ తన కూతురి మామ శైలేంద్ర అలియాస్ బిల్లుతో పరారైంది. 

వివరాల్లోకి వెళితే.. మమత భర్త సునీల్ కుమార్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే ఇంటికి వస్తుండేవాడు. ఈ మధ్యకాలంలో సునీల్ ఇంట్లో లేని సమయంలో మమత తరచుగా శైలేంద్రను ఇంటికి పిలిపించుకునేదని, అతడితో సంబంధం కొనసాగించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

మమత కుమారుడు సచిన్ మాట్లాడుతూ.. మూడు రోజులకోసారి శైలేంద్రను అమ్మ ఇంటికి పిలిపించుకునేదని, దీంతో తాము రూమును మార్చుకోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి టెంపోలో పారిపోయారని తెలిపాడు. తాను క్రమం తప్పకుండా భార్య మమతకు డబ్బులు పంపుతుండేవాడినని, కానీ ఆమె మాత్రం శైలేంద్రను ఇంటికి పిలిపించుకుని అతడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఇప్పుడు నగదు, బంగారంతో కలిసి పరారైందని వాపోయాడు.

మహిళ పొరిగింటి వ్యక్తి అవధేశ్ కుమార్ మాట్లాడుతూ.. సునీల్ నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడని, అతడు లేని సమయంలో శైలేంద్రను మమత ఇంటికి పిలిపించుకునేదని చెప్పాడు. అతడు బంధువు కావడంతో ఎవరూ అనుమానించలేదని తెలిపాడు. శైలేంద్ర అర్ధరాత్రి ఇంటికి వచ్చి, ఉదయం వరకు ఉండేవాడని చెబుతున్నారు. ఈ ఘటనపై సునీల్ కుమార్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, 43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకమ్మాయికి 2022లో వివాహమైంది. ఈ క్రమంలో కుమార్తె మామ శైలేంద్ర (46)తో సంబంధం పెంచుకున్న మమత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకోవడంతో పరారయ్యారు. 

Mamata
Shailendra
Bilal
Uttar Pradesh
Badayun
Extramarital Affair
Four Children
Husband Sunil Kumar
Wife elopes with daughter's uncle
Indian Crime News
  • Loading...

More Telugu News