చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
- 2024-25లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న రామకృష్ణ
- రాష్ట్రానికి రావాల్సిన రూ. 3,324 కోట్లు తగ్గాయని వ్యాఖ్య
- కేంద్ర ప్యాకేజీతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కాదన్న రామకృష్ణ
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 17 వేల కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం చెపుతోందని... అలాంటప్పుడు కేవలం రూ. 11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదని రామకృష్ణ అన్నారు. ప్లాంటును కాపాడుకోవడానికి శాశ్వత పరిష్కారం చూపించి, సొంత ఇనుము గనులు కేటాయించాలని కోరారు. సెయిల్ లో విలీనం చేయాలని ఆయన సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదనే అనుమానాలు తమకు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు.