కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్... పార్టీకి మేయర్ రాజీనామా
- బీఆర్ఎస్ పార్టీకి మేయర్, పదిమంది కార్పొరేటర్లు గుడ్బై
- రేపు బీజేపీలో చేరే అవకాశం
- బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరు రేపు బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు.