న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు రావొద్దు.. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
డాక్టర్ మన్మోహన్ మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ లోపే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవడం సరికాదని భావించిన శాసన సభాపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1న తనను వ్యక్తిగతంగా కలిసేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.