నయనతారకు మద్రాస్ హైకోర్టు నోటీసులు
- నయనతార డాక్యుమెంటరీ వివాదం
- తన అనుమతి లేకుండా సినిమా ఫుటేజీ వాడుకున్నారని ధనుష్ ఆగ్రహం
- రూ. 10 కోట్లు డిమాండ్ చేసిన ధనుష్
'నానుమ్ రౌడీ దాన్' చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు. నయన్ దంపతులకు, నెట్ ఫ్లిక్స్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో ధనుష్ ను నయనతార తప్పుపట్టారు. తనపై ద్వేషం కనపరుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ధనుష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, జనవరి 8వ తేదీలోపు బదుల్వివాలంటూ నయన్ దంపతులు, నెట్ ఫ్లిక్స్ కు మద్రాస్ హైకోర్టు తాజాగా నోటీసులు పంపింది.