ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మధురైలో కేసు నమోదు
- ఉదయనిధి స్టాలిన్పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ఫిర్యాదు
- తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదన్న లాయర్
- అయినా ఉదయనిధిపై అనవసర వ్యాఖ్యలు చేశారని కమిషనర్కు కంప్లైంట్
ఈ నేపథ్యంలో వంజినాథన్ అనే న్యాయవాది పవన్ కల్యాణ్పై మధురై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ విమర్శలు చేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి కూడా స్పందించారు. పవన్ కామెంట్స్పై మీ స్పందనేంటన్న ప్రశ్నకు ‘వెయిట్ అండ్ సీ’ అని బదులిచ్చారు.