పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం బాధ్యతను మిథున్ రెడ్డికి అప్పగించిన సీఎం జగన్!
- ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్
- పిఠాపురంలో వైసీపీ తరఫున ఎంపీ వంగా గీత పోటీ
- సీఎం జగన్ సహా ప్రచారానికి రానున్న వైసీపీ అగ్రనేతలు
- గతంలో రెండు చోట్లా వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన జనసేనాని
గతంలో పవన్ ను ఎలా ఓడించారో, ఈసారి కూడా అలాగే ఓడించేందుకు వైసీపీ వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం అసెంబ్లీ బరిలో దించుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ పిఠాపురం గెలుపు బాధ్యతలు ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు.
పిఠాపురంలో వైసీపీ ముఖ్యనేతలతో ప్రచారం చేయించనున్నారు. సీఎం జగన్ కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.
కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరిన నేపథ్యంలో, సామాజిక సమీకరణాల పరంగా కూడా తమకు కలిసివస్తుందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. వంగా గీత ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు.