Advertisement

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేపట్టిన ధర్నాలన్నీ డ్రామాలే: బండి సంజయ్

Bandi Sanjay calls Rahul Gandhi and Revanth Reddy protests political dramas
  • వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందన్న సంజయ్
  • రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం బీజేపీకే లాభమని వ్యాఖ్య
  • రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన

నీట్ వివాదం, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆందోళన డ్రామాలకు తెరదీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం అది బీజేపీకే లాభమని, ఆయన తమ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. ప్రధాని నివాసం వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని, నీట్ అంశంపై కేంద్రం పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే, రాహుల్ కాబోయే ప్రధాని అని రేవంత్ రెడ్డి అనడం పెద్ద జోక్ అని కొట్టిపారేశారు.


ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి చేపట్టిన ధర్నాలన్నీ కేవలం రాజకీయ నాటకాలేనని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు ప్రతిపక్షంగా కూడా చూడటం లేదని, సీజేపీతో పోటీ పడేందుకే ఈ తరహా నిరసనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు, తెలంగాణలో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతుంటే, ఎరువులు అందక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు మాని వెంటనే రైతులకు నీరందించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Bandi Sanjay
Rahul Gandhi
Revanth Reddy
NEET controversy
Congress protests
Telangana politics

More Telugu News