బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందంటూ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం
- కాంగ్రెస్ ఎప్పుడూ కనీసం 50 శాతం ప్రజల మద్దతు తెచ్చుకోలేకపోయిందన్న పొన్నాల
- కాంగ్రెస్లో వెనుకబడిన వర్గాలు గెలవలేకపోతున్నారని విమర్శ
- బీసీలకు బీఆర్ఎస్సే టిక్కెట్లు ఇస్తోందన్న పొన్నాల
బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేస్తోందని, బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. సర్వేలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బీసీలపై ప్రయోగాలు చేస్తోందన్నారు. 40 శాతం బీసీలు ఉన్నప్పుడే మొత్తం 50 శాతం సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్ ఇప్పుడు ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలేనని, మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అవుతారన్నారు.