నీట్ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన సానియా మీర్జా
- నీట్ విద్యార్థులకు మద్దతు ప్రకటించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
- విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
- విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని స్పష్టం
- హింసకు తావులేదని, శాంతియుతంగా పరిష్కరించాలని సూచన
నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తన మద్దతు ప్రకటించింది. విద్యార్థుల వాదనలను వినాలని, దేశ విద్యా వ్యవస్థలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని ఆమె స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది.
నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన విద్యార్థులు, తాజా వివాదాల వల్ల అనిశ్చితిని ఎదుర్కోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "విద్యార్థులే మన దేశ భవిష్యత్తు" అని పేర్కొంటూ, విద్యార్థుల పట్ల తన సానుభూతిని తెలిపింది. పరీక్షల నిర్వహణ ప్రక్రియపై విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
"మన సమాజంలో హింసకు తావు లేదు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మనమందరం కలిసి శాంతియుత మార్గంలో పరిష్కారం కనుగొనాలి" అని సానియా మీర్జా పిలుపునిచ్చింది.
ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేపర్ లీక్ల వ్యవహారంలో జవాబుదారీతనం వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరులో సమూల మార్పులు తీసుకురావాలని నిరసనకారుల ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన విద్యార్థులు, తాజా వివాదాల వల్ల అనిశ్చితిని ఎదుర్కోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "విద్యార్థులే మన దేశ భవిష్యత్తు" అని పేర్కొంటూ, విద్యార్థుల పట్ల తన సానుభూతిని తెలిపింది. పరీక్షల నిర్వహణ ప్రక్రియపై విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
"మన సమాజంలో హింసకు తావు లేదు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మనమందరం కలిసి శాంతియుత మార్గంలో పరిష్కారం కనుగొనాలి" అని సానియా మీర్జా పిలుపునిచ్చింది.
ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేపర్ లీక్ల వ్యవహారంలో జవాబుదారీతనం వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరులో సమూల మార్పులు తీసుకురావాలని నిరసనకారుల ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.