టీ20 ప్రపంచ కప్ సెమీస్ కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ
- అనారోగ్యంతో హర్మన్ ప్రీత్, వస్త్రాకర్ దూరం
- నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు
- సాయంత్రం 6.30 గంటల నుంచి మ్యాచ్
హర్మన్ ప్రీత్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు స్పిన్నర్ రాధా యాదవ్ ఫిట్ నెస్ పైనా అనుమానాలు ఉన్నాయి. హర్మన్ మ్యాచ్ లో ఆడకపోతే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జట్టుకు నాయకత్వం వహించనుంది. హర్మన్ స్థానంతో తుది జట్టులోకి హర్లీన్ డియోల్ వచ్చే అవకాశం ఉంది. అత్యంత బలమైన ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో ఎంతో అనుభజ్ఞురాలైన హర్మన్ లేకుండా బరిలోకి దిగితే భారత్ జట్టుకు మరింత సవాల్ తప్పకపోవచ్చు. ఈ సెమీఫైనల్ సాయంత్రం 6.30 గంటలకు మొదలవనుంది.