పార్టీ నేతలు, లాయర్లతో కలిసి సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్
- గత ఏడాది 'భారతి పే' పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్
- ఐటీడీపీ ఇన్చార్జ్ విజయ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ
- విచారణ సమయంలో లాయర్ ను అనుమతించాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు
అయితే విచారణకు హాజరుకాకుండా కోర్టు నుంచి విజయ్ స్టే తెచ్చుకున్నారు. ఈ నెల 27న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆ రోజున విచారణకు హాజరు కాలేనని మరోసారి ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యారు. విజయ్ తో పాటు ఆయన లాయర్ ను కూడా అనుమతించాలని సీఐడీ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సీఐడీ కార్యాలయానికి విజయ్ వచ్చిన నేపథ్యంలో అక్కడకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఇంకోవైపు, పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.