Vijay Devarakonda: 'ఖుషి' సినిమాపై దృష్టి సారించనున్న విజయ్ దేవరకొండ

  • విజయ్ కు నిరాశను మిగిల్చిన 'లైగర్'
  • ఇప్పుడు విజయ్ కు ఒక మంచి హిట్ అవసరం
  • దీంతో తదుపరి సినిమాపై దృష్టి సారించాలని నిర్ణయించిన విజయ్
Vijay Devarakonda to fucus on Khushi movie

'లైగర్' సినిమా పరాజయం పొందడంలో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ తో పాటు యూనిట్ సభ్యులందరినీ నిరాశకు గురి చేసింది. ఈ సినిమా హిట్ అయ్యుంటే పాన్ ఇండియా లెవెల్లో విజయ్ ఓ రేంజ్ కి వెళ్లిపోయేవాడు. కానీ, ఫలితం మరోలా వచ్చింది. అయితే, ఈ నిరాశ నుంచి బయట పడేందుకు విజయ్ యత్నిస్తున్నారు. తన తదుపరి చిత్రం 'ఖుషి'పై పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాకు సంబంధించి దుబాయ్ లో జరిగే రెండు రోజుల ఈవెంట్ కు విజయ్ హాజరు కాబోతున్నాడు. ఆ తర్వాత 'ఖుషి' రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. 'లైగర్' డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో, విజయ్ కు ఇప్పుడు ఒక మంచి హిట్ సినిమా అవసరం. అందుకే అన్నింటిని పక్కన పెట్టి తన తదుపరి చిత్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు.

  • Loading...

More Telugu News