ప్ర‌ధాని ఆవిష్క‌రించ‌నున్న అల్లూరి విగ్ర‌హం వ‌ద్ద మంత్రి రోజా!... ఫొటోలు ఇవిగో!

ap minister rk roja inspects arrangements of modi bhimavaram programme
  • ఈ నెల 4న భీమ‌వ‌రానికి రానున్న ప్ర‌ధాని మోదీ
  • అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న వైనం
  • ప్ర‌ధాని కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు
మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతిని పుర‌స్క‌రించుకుని భీమ‌వ‌రంలో ఈ నెల 4న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. 30 అడుగుల ఎత్తులో అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి కాగా...విగ్రహం కూడా సిద్ధ‌మైంది. 

ఈ ఏర్పాట్ల‌ను శ‌నివారం జిల్లాకు చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి మంత్రి ఆర్కే రోజా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అల్లూరి విగ్ర‌హం వ‌ద్ద నిలుచుని రోజా ఫొటోలు దిగారు. స‌ద‌రు ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.
Go Back to Shorts
Alluri Seetharama Raju
Bhimavaram
Roja
Prime Minister
Narendra Modi

More Telugu News