రోడ్డు ప్రమాదానికి గురైన వారిని తన కారులో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియ

Bhuma Akhila Priya humanitarian gesture gets accolades
  • కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లిన కారు
  • ముగ్గురికి గాయాలు
  • మానవతా దృక్పథంతో స్పందించిన అఖిలప్రియ 
టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మానవతాదృక్పథం ప్రదర్శించారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం వెంకటాపురం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. 

ఆ సమయంలో అటుగా వెళుతున్న భూమా అఖిలప్రియ ప్రమాదం గురించి తెలుసుకుని తన వాహనం ఆపారు. గాయపడిన వారి పరిస్థితి పట్ల చలించిపోయిన ఆమె, వారిని వెంటనే తన కారులో ఎక్కించి నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియను స్థానికులు అభినందిస్తున్నారు.
Go Back to Shorts
Bhuma Akhila Priya
Humanity
Road Accident
Hospital
Kurnool District

More Telugu News