శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఆస్తుల‌ను సీజ్ చేసిన ఈడీ

Enforcement Directorate attaches shivsena mp sanjay raut properties
  • శివ‌సేన ఎంపీగా, సామ్నా ఎడిట‌ర్‌గా రౌత్‌కు గుర్తింపు
  • పాత్ర ఛాల్ భూ కుంభ‌కోణంలో రౌత్‌పై ఆరోప‌ణ‌లు
  • రెండు ప్లాట్ల‌ను అటాచ్ చేస్తూ ఈడీ కీల‌క నిర్ణ‌యం
  • భ‌య‌ప‌డేది లేదంటూ రౌత్ కామెంట్‌
మ‌హారాష్ట్రలో అధికార పార్టీ శివ‌సేన‌కు చెందిన ఎంపీ, ఆ పార్టీ ప‌త్రిక సామ్నా ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మంగ‌ళ‌వారం షాకిచ్చింది. గ‌తంలో వెలుగు చూసిన పాత్ర ఛాల్ భూ కుంభ‌కోణంలో రౌత్ పాత్రపై ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఈ ఆరోప‌ణ‌ల ఆధారంగా రౌత్‌కు చెందిన స్థిరాస్తుల‌ను ఈడీ అటాచ్ చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

పాత్ర ఛాల్ భూ కుంభ‌కోణంలో రూ.1,034 కోట్ల మేర అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ గ‌తంలో ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఈ కేసు ద‌ర్యాప్తును చేప‌ట్టిన ఈడీ.. తాజాగా రౌత్‌కు చెందిన స్థిరాస్తుల‌ను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో రౌత్‌కు చెందిన‌ ముంబైలోని అలీబాగ్‌, దాద‌ర్‌ల‌లోని ఒక్కో ప్లాట్ ఉన్నాయి. ఈడీ అటాచ్‌పై స్పందించిన రౌత్‌.. ఈ త‌రహా బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని అన్నారు. ఆస్తుల‌ను సీజ్ చేసినా, కాల్చివేసినా, జైలుకు పంపినా కూడా భ‌య‌ప‌డేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.
Go Back to Shorts
Shiv Sena
Maharashtra
Sanjay Raut
Enforcement Directorate

More Telugu News