Allu Arjun: 'పుష్ప' కోసం మీ స్వేదం చిందించారు: మెగాస్టార్

  • 'పుష్ప'రాజ్ గా అల్లు అర్జున్
  • రేపు భారీస్థాయి రిలీజ్
  • ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్
  • ఐటమ్ సాంగ్ లో సమంత    
  • ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరంజీవి 
Pushpa movie update

అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ వారు 'పుష్ప' సినిమాను నిర్మించారు. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమరవాణా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతి పాత్ర ఒక ప్రత్యేకతను సంతరించుకుని, ప్రత్యేకమైన లుక్ తో కనిపిస్తుండటం విశేషం. సుకుమార్ రూపొందించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ కి ట్విట్టర్ ద్వారా చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. "సుకుమార్ .. అల్లు అర్జున్ .. రష్మిక మీరంతా కూడా ఈ సినిమా కోసం స్వేదం .. రక్తం చిందించారు. ఎంతో హార్ట్ ఫుల్ గా పనిచేశారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలంగా విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. సునీల్ .. అనసూయ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. సమంత ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News