జ‌గ‌న్ గారూ, ఇప్పటికైనా కేసీఆర్ దగ్గరికెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరించండి: సోమిరెడ్డి

somi reddy slams jagan
  • కృష్ణా డెల్టాకు 70 టీఎంసీల గోదావరి నీళ్లు అందుబాటులోకి..
  • రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నుంచి నికరజలాలు కేటాయించండి
  • ఈ మేర‌కు జీఓ ఇవ్వండి
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స్పందిస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ స‌మ‌స్య‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో చ‌ర్చించి ప‌రిష్క‌రించాల‌ని జ‌గ‌న్‌కు ఆయ‌న సూచించారు.

'వైఎస్ జ‌గ‌న్ గారూ, ఇప్పటికైనా కేసీఆర్ దగ్గరికెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరించండి. కృష్ణా డెల్టాకు 70 టీఎంసీల గోదావరి నీళ్లు అందుబాటులోకి వచ్చిన క్రమంలో ఆ మేర రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నుంచి నికర జలాలు కేటాయిస్తూ జీఓ ఇవ్వండి' అని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Jagan

More Telugu News