ఎన్టీఆర్ మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Producer Nagavamsi gave a clarity on NTR Movie
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్
  • ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ప్రచారం
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలయ్యే అవకాశం
ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. త్రివిక్రమ్ మూవీ 'అల వైకుంఠపురములో' విడుదలకాక ముందు నుంచే ఈ టాక్ వినిపిస్తూ వచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న రాజమౌళి సినిమా పూర్తి కాగానే, త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళతాడని అనుకున్నారు. కానీ అలా జరగకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. దాంతో అభిమానులు నిరాశకి లోనవుతున్నారు.

అయితే బలంగా జరుగుతున్న ప్రచారాన్ని చూస్తూ ఊరుకుంటే, అదే నిజమని అనుకునే అవకాశం ఉంది గనుక, ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. 'అది నైస్ జోక్ గైస్ ' అని ట్వీట్ చేస్తూ, ఫన్నీ ఇమోజిస్ జత చేశారు. అలా ఆయన ఈ సినిమా ఆగిపోయిందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారానికి తెర దించేశారు.

కోవిడ్ వైపు నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఈ నెల చివరిలోగానీ .. వచ్చేనెల మొదటివారంలో గాని 'అయిననూ పోయిరావలె హస్తినకు' రెగ్యులర్ షూటింగు మొదలు కావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
Trivikram Srinivas
Junior NTR
Suryadevara Nagavamshi

More Telugu News