Corona Virus: తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు

197 new cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,120
  • కోలుకున్న వారు 2,89,987 మంది
  • మృతుల సంఖ్య 1,596
  • జీహెచ్ఎంసీలో కొత్తగా 38 కరోనా కేసులు  
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 356 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,120 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,89,987 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,596 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,537 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,083 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదయ్యాయి.

Corona Virus
COVID19
Telangana

More Telugu News