Priyamani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ప్రియమణి పాన్ ఇండియా ఫిలిం 
  • వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ?
  • షూటింగుకి రెడీ అవుతున్న రజనీకాంత్
Priyamani plays key role in a pan India film

*  ప్రముఖ నటి ప్రియమణి ప్రధాన పాత్రధారిగా రాజేశ్ టచ్ రివర్ దర్శకత్వంలో 'సైనైడ్' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఇరవై మంది యువతులను దారుణంగా హత్య చేసిన సైనైడ్ మోహన్ జీవిత కథ ఆధారంగా దీనిని పాన్ ఇండియా ఫిలింగా నిర్మిస్తున్నారు.  
*  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ త్వరలో బాలకృష్ణ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వుంది. ప్రస్తుతం చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ చేస్తున్న వినాయక్ ఇటీవల లాక్ డౌన్ సమయంలో బాలకృష్ణ కోసం ఓ కథను తయారుచేసుకుని ఆయనకు వినిపించాడని, అది బాలకృష్ణకు నచ్చిందని తెలుస్తోంది. పూర్తి స్క్రిప్టు తయారుచేసుకుని రమ్మని బాలయ్య చెప్పినట్టు సమాచారం.
*  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా షూటింగుకి రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగును ఈ నెల 15 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News