ప్రధాని మోదీ చేతుల మీదుగా ముగిసిన అయోధ్య భూమి పూజ.. మోదీ ముఖంలో వెల్లివిరిసిన ఆనందం!

Ayodhya Bhoomi Pooja completed
  • అయోధ్యలో ముగిసిన భూమిపూజ కార్యక్రమం
  • నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకల వినియోగం
  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయెధ్య రాముడి మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం పూర్తయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, రామ మందిరం ట్రస్ట్ ఛైర్మన్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాధువులు హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ కన్నులపండువగా జరిగింది.

ఈ కార్యక్రమంలో నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఈ ఐదు వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమశాస్త్ర పండితుల భావన. భూమిపూజలో హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను వినియోగించారు. మరోవైపు భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

భూమిపూజ పూర్తైన వెంటనే ప్రధాని మోదీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మోదీ, యోగి, మోహన్ భగవత్ లు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Go Back to Shorts
Ayodhya Ram Mandir
Bhoomi Pooja
Narendra Modi

More Telugu News