పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పవన్ కల్యాణ్
- ఉగ్రవాదుల తీరు హేయం
- జవాన్ల మృతి మనసును కలిచివేస్తోంది
- దేశం యావత్తు అండగా నిలవాల్సిన సమయమిది
అమరులైన జవాన్ల త్యాగాలను భరత జాతి ఎప్పటికీ మర్చిపోదని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు దేశం యావత్తు అండగా నిలవాలని కోరారు. ఉగ్రవాదులు మనవైపు మరోసారి కన్నెత్తి చూడకుండా జవాన్లలో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం కేంద్రంపై ఉందని పవన్ పేర్కొన్నారు.