ఏడాది కనిష్ఠానికి దిగొచ్చిన పెట్రోలు ధరలు!
- మంగళవారం నాడు పెట్రోలుపై 7 పైసల తగ్గింపు
- మారని డీజిల్ ధర
- ఢిల్లీలో రూ. 66.79కి లీటర్ పెట్రోల్
- 2018లో ఇదే అతి తక్కువ
నేడు దేశ రాజధానిలో లీటరు పెట్రోలు ధర రూ. 66.79గా ఉండగా, కోల్ కతాలో రూ. 71.89, ముంబైలో రూ. 75.41, చెన్నైలో రూ. 72.41 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డీజిల్ ధరను మాత్రం సవరించకుండా సోమవారం నాటి ధరనే కొనసాగిస్తున్నట్టు ఓఎంసీలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 2017 నాటి స్థాయికన్నా కిందకు జారాయి. దీంతో ఇండియాలో మరింతగా ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.