ఉత్తమ్ కుమార్ ఓటమి కోసం అహర్నిశలు కష్టపడతా: టీడీపీ నేత మల్లయ్య యాదవ్ హెచ్చరిక
- త్యాగాలకు సిద్ధ పడాలంటూ మాకు సీట్లివ్వరా!
- సిట్టింగ్ సీట్లను టీడీపీ త్యాగం చేసింది
- నల్గొండ జిల్లా మొత్తం అగ్ర కులాలకే కట్టబెడతారా?
తనకు టికెట్ రాకపోవడానికి కారణం తమ పార్టీ బలహీనత, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్థం ఉందని విమర్శించారు. ఉత్తమ్ భార్య పద్మావతికి, కోదాడ నియోజకవర్గానికి సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. సిట్టింగ్ సీట్లను త్యాగం చేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిట్టింగ్ సీట్లను ఎందుకు అడగదు? నల్గొండ జిల్లా మొత్తం అగ్ర కులాలకే కట్టబెడతారా? టీడీపీలో ఒక్క యాదవుడికి కూడా టికెట్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఉత్తమ్ దగ్గర పార్టీని తాకట్టుపెట్టిందని, ఉత్తమ్ అవినీతి బండారం బయటపెడతానని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.