ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండి.. ఎప్పటికీ మమ్మల్నే కోరుకునేలా పరిపాలన అందిస్తాం: పవన్
- విజయనగరం జిల్లా ఎస్.కోటలో బహిరంగ సభ
- మేము సరికొత్త మార్పును తీసుకొస్తాం
- యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సి ఉంది
- ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సి ఉంది
ఈరోజు విజయనగరం జిల్లా ఎస్.కోటలోని దేవిగుడి జంక్షన్లో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తరాంధ్రాని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకి, ఆకాంక్షలకి ప్రభుత్వం అనుగుణంగా లేదని అన్నారు. కాగా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.