నడిరోడ్డుపై మోడల్కు చేదు అనుభవం.. స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
- ఇండోర్కు చెందిన మోడల్
- యాక్టివా మీద వెళుతుండగా ఘటన
- స్కర్ట్ను లాగేందుకు ఇద్దరు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు
- దుండగులను పట్టుకుంటామన్న శివరాజ్ సింగ్ చౌహాన్
ఈ ఘటన ఇండోర్లోని రద్దీ రోడ్డులో జరిగిందని తెలిపింది. అందరు చూస్తూ వెళ్లిపోయారే కానీ, ఒక్కరూ కూడా ఆ పోకిరీలను ఏమీ అనలేదని చెప్పింది. తాను వారి బైక్ నంబర్ను కూడా గమనించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఏ దుస్తులు వేసుకోవాలన్నది తన ఇష్టమని ఆమె పేర్కొంది. స్కర్ట్ వేసుకుని బయటకు వస్తే అసభ్యంగా ప్రవర్తించే హక్కు వారికి ఇచ్చినట్టు కాదని అంది. ఓ వ్యక్తి ఈ ఘటన జరిగిన తరువాత తన వద్దకు వచ్చి స్కర్ట్ వేసుకున్నందుకే ఇలా చేశారని అన్నాడని, ఆయన వ్యాఖ్య తనను ఎంతగానో బాధించిందని ఆమె తెలిపింది.
రద్దీ రోడ్డులోనే పరిస్థితి ఇంతగా ఉంటే, జనాలు లేని వీధుల్లో ఇంకా దారుణంగా ఉంటుందేమోనని పేర్కొంది. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు కూడా లేవని, ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. ఆమె చేసిన ట్వీట్పై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ దుండగులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు.