లంచ్ దాకా లాక్కొచ్చిన లంక... డ్రా చేసుకునేందుకు విఫలయత్నాలు!
- ఈ ఉదయం ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన లంక
- ఒక పరుగు మాత్రమే చేసి మ్యాథూస్ అవుట్
- హాఫ్ సెంచరీ చేసి రాణించిన ధనంజయ
ఉదయం ఆట ప్రారంభించిన కాసేపటికే మ్యాథ్యూస్ ను జడేజా తన అద్భుత బౌలింగ్ తో బోల్తా కొట్టించాడు. దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మ్యాథ్యూస్ 35 పరుగుల వద్ద అవుట్ కాగా, ఆపై మరో వికెట్ ను ఇండియా తీయలేకపోయింది. లంచ్ విరామ సమయానికి లంక స్కోరు 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు కాగా, విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే, మరో ఆరు వికెట్లు తీయాల్సివుంది. ఈ మ్యాచ్ లో లంక విజయం దాదాపు అసాధ్యమే, అయితే, కనీసం మరో నాలుగు గంటల పాటు వికెట్లు పోకుండా కాపాడుకోగలిగితే, మ్యాచ్ డ్రా అవుతుంది.