'కోహ్లీ! వారికి.. మీరేం చెబుతారు?' అని అడిగిన మిస్ వరల్డ్ మానుషి చిల్లర్
- అవార్డుల కార్యక్రమంలో కోహ్లీని ప్రశ్నించిన మిస్ వరల్డ్
- చక్కని సమాధానం చెప్పిన కోహ్లీ
- మీరు మీరుగా ఉండండి, నిజాయతీగా ఆడండి అంటూ చెప్పిన టీమిండియా కెప్టెన్
ఈ సందర్భంగా కోహ్లీని మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ప్రశ్నిస్తూ, ‘‘ఇవాళ మీరు ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్ మన్. పిల్లలకు, ప్రత్యేకించి క్రికెట్ ప్రపంచంలో ఉన్నవారికి మీరిచ్చే సందేశం ఏమిటి?’’ అంది. దానికి కోహ్లీ సమాధానమిస్తూ, ‘‘మైదానంలో మీరు ఎప్పుడు ఏమి చేసినా మీ ఆట మీరు ఆడండి. యథార్థంగా, మనస్పూర్తిగా ఆటను ఆడండి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని నటిస్తున్నట్టుగా అనుమానిస్తారు.
ఒక్కసారి వాళ్లకు అలాంటి సందేహం వస్తే వారెప్పటికీ మిమ్మల్ని కనెక్ట్ కాలేరు. ఇక నా విషయానికి వస్తే... మైదానంలో నేనెప్పుడూ నేనుగానే ఉన్నాను. నేనెలా ఉన్నాను? ఎలా ఆడుతున్నాను? అని చాలా మంది సతమతమవుతుంటారు. కానీ నేనెప్పుడూ అలా సతమతం కాలేదు. నేనెలా ఆడగలనో అలాగే ఆడాను.. ఆడుతున్నాను.’’ అంటూ సమాధానం చెప్పాడు.