మీడియాపై పరువునష్టం దావా గెలిచిన విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్
- తప్పుడు కథనం రాసిన ఫైర్ఫాక్స్ మీడియాపై గేల్ కేసు
- మీడియాకు సిడ్నీ కోర్టు మొట్టికాయలు
- తాను చాలా మంచివాడినన్న గేల్
ఈ కథనాలపై కలత చెందిన గేల్ సిడ్నీ కోర్టులో కేసు వేశాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు కథనమని పేర్కొన్నాడు. తన పరువుకు భంగం కలిగించిన ‘ఫైర్ఫాక్స్’పై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసును సోమవారం విచారించిన కోర్టు గేల్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. పాఠకులు ఆకర్షితులయేలా కథనాలు రాస్తున్నారు తప్పితే నిజానిజాలను విస్మరిస్తున్నారంటూ సదరు మీడియా సంస్థకు కోర్టు మొట్టికాయలు వేసింది. ఓ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుడి పట్ల కథనాలు రాసేముందు నిజానిజాలు నిర్ధారించుకోవాల్సిన పనిలేదా? అని ప్రశ్నించింది.
కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంపై గేల్ హర్షం వ్యక్తం చేశాడు. తాను చాలా మంచి వ్యక్తినని పేర్కొన్నాడు. తనపై అటువంటి కథనం ప్రచురించినందుకు ఎంతగానో బాధపడ్డానని పేర్కొన్నాడు. అయితే తాను డబ్బు కోసం కేసు వేయలేదన్నాడు. ఈ సందర్బంగా తన లీగల్ టీమ్కు కృతజ్ఞతలు తెలిపాడు.