తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
- ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, టీటీడీ ఛైర్మన్
- పండితుల నుంచి వేదాశీర్వచనం అందుకున్న ఉపరాష్ట్రపతి
- ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి తిరుమల పర్యటన
- దేశ ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు వెల్లడి
అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి నమస్కరించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఛైర్మన్, ఈవో కలిసి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు. ఈ పర్యటనలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రజల శాంతి, శ్రేయస్సు, సౌభాగ్యం కోసం స్వామివారిని ప్రార్థించినట్లు ఉపరాష్ట్రపతి తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, సోమవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు.
ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాధాకృష్ణన్ తిరుమల రావడం ఇది రెండోసారి. గత ఏడాది సెప్టెంబర్ 25న కూడా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి టీటీడీ నిర్మించిన ‘వెంకటాద్రి నిలయం’ యాత్రికుల వసతి సముదాయాన్ని ప్రారంభించారు.