Nara Lokesh: ఆయనకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామికి మనమందరం అండగా నిలవాలని ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కుమారస్వామి కాపాడారని, ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం మన అదృష్టమని లోకేశ్ అన్నారు. కుమారస్వామికి ఎప్పుడూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
కర్ణాటకలోని సింధనూరు హోసళ్లీ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను శనివారం లోకేశ్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు.
కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆయన కొనియాడారు. దేశం కోసం సైనికులు చేస్తున్న ప్రాణత్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
కర్ణాటకలోని సింధనూరు హోసళ్లీ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను శనివారం లోకేశ్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు.
కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆయన కొనియాడారు. దేశం కోసం సైనికులు చేస్తున్న ప్రాణత్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.