లిక్కర్ స్కామ్ లో వాస్తవాలు దేశం నివ్వెరపోయేలా ఉన్నాయి: పయ్యావుల
- సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్న పయ్యావుల
- ఐఐటీ ప్రొఫెషనల్స్ తో బాక్సులకు బాక్సుల డబ్బులు తరలించారని ఆరోపణ
- బుగ్గన బుర్రకథలు ఆపాలని హితవు
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉదయ్ భాస్కర్ రెడ్డి దాదాపు 200 తప్పుడు మెయిల్స్ పెట్టాడని... ఆయనపై కేసులు పెట్టి తీరతామని అన్నారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటన సందర్భంగా ట్రాక్టర్ ల నుంచి బలవంతంగా మామిడికాయలు కింద పారబోశారని మండిపడ్డారు. ట్రాక్టర్ లాక్కొచ్చి చేసిన ట్రిక్స్ డ్రోన్ కెమెరాల్లో బయటపడ్డాయని తెలిపారు. వైసీపీలో అస్తిత్వం కోసం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని... వెటకారం తగ్గించుకోవాలని, ఇప్పటికైనా బుర్రకథలు ఆపాలని హితవు పలికారు. జగన్ రోడ్డు మీదకు వస్తే తలకాయలు కానీ, మామిడికాయలు కానీ పగలాల్సిందేనని చెప్పారు.