Shobana: రెండో విడత పద్మ పురస్కారాలు: శోభనకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ ప్రదానం

Shobana Receives Padma Bhushan Manda Krishna Honored with Padma Shri
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం సాయంత్రం పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, తొలి విడతలో నందమూరి బాలకృష్ణ, డాక్టర్ నాగేశ్వర్‌ రెడ్డి వంటి తెలుగు ప్రముఖులతో పాటు మొత్తం 71 మందికి ఏప్రిల్ 28న పురస్కారాలు ప్రదానం చేశారు. తాజాగా జరిగిన రెండో విడత కార్యక్రమంలో మరికొందరు ప్రముఖులు ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి శోభన పద్మభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య), ప్రొఫెసర్‌ కేఎల్‌ కృష్ణ (సాహిత్యం, విద్య) కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది.
Go Back to Shorts
Shobana
Padma Awards
Padma Bhushan
Manda Krishna Madiga
Padma Shri
Droupadi Murmu

More Telugu News