Draupadi Murmu: వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది... గెజిట్ విడుదల చేసిన కేంద్రం

Waqf Amendment Act 2025 Comes into Effect
షార్ట్స్‌లో చూడండి
వక్ఫ్ సవరణ చట్టం-2025 అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లు ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనిని అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంటు ఉభయ సభల నుంచి ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది.

ఈ చట్టాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది.

మరోవైపు, ఈ వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. 

కేంద్ర ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని సుప్రీంకోర్టును కోరింది.
Go Back to Shorts
Draupadi Murmu
Waqf Amendment Act 2025
Indian Parliament
Supreme Court of India
Central Government
Muslim Organizations
Waqf
India
Government Notification
Legal Challenge

More Telugu News