మంత్రి నాదెండ్లకు డిప్యూటీ సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలు
––
గత పాలకులు పక్కదారి పట్టించిన ప్రజాపంపిణీ వ్యవస్థను నాదెండ్ల చక్కదిద్దుతున్నారని తెలిపారు. పీడీఎస్ మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. ఖరీఫ్ సీజన్లో విజయవంతంగా ధాన్యం సేకరించారని పవన్ కల్యాణ్ చెప్పారు. నిత్యావసరాల ధరలు అదుపులోకి తీసుకురావడం, దీపం-2 పథకం అమలు రాష్ట్రంలోని మహిళలకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
రాష్ట్ర మంత్రిగా తన కర్తవ్య నిర్వహణను బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో చేస్తున్నారని కొనియాడారు. పార్టీ శ్రేణులను, నాయకులను అనుసంధానించుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఆయన నిర్వర్తించిన పాత్ర మరచిపోలేనిదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.