రియా చక్రవర్తికి మీడియా క్షమాపణ చెప్పాలి.. నటి దియా మీర్జా డిమాండ్
- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో రియాకు వ్యతిరేకంగా వార్తలు
- తాజాగా సుశాంత్ ది ఆత్మహత్యేనని తేల్చిన సీబీఐ
- ఈ వ్యవహారంలో రియాను దోషిగా చూపే ప్రయత్నం జరిగిందన్న దియా మీర్జా
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ.. టీఆర్ పీ కోసం నిరాధార కథనాలను వండివార్చిందంటూ మీడియాపై దియా మండిపడ్డారు. మీడియా వేధింపులకు రియా, ఆమె కుటుంబం ఎంతో క్షోభ అనుభవించిందని చెప్పారు. సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా, సీబీఐ క్లీన్ చిట్ పై నటి రియా చక్రవర్తి ఇప్పటి వరకూ స్పందించలేదు. రియా సోదరుడు మాత్రం ‘సత్యమేవ జయతే’ అంటూ రియా ఫొటోతో ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.