సిడ్నీ టెస్టులో ఆడకపోవడంపై స్పందించిన రోహిత్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు!
- రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదన్న రోహిత్శర్మ
- జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టీకరణ
- ఐదో టెస్టు నుంచి విశ్రాంతి మాత్రమే తీసుకున్నానని వివరణ
- ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసన్న కెప్టెన్
పెర్త్ టెస్టు విజయంలో కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం ఎంతో విలువైనదని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి ఆ జోడీని మార్చకూడదని అనుకున్నామని, అలాగే, ఫామ్ పరంగానూ రాహుల్ మెరుగ్గా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల తర్వాతే తాను అని స్పష్టం చేశాడు. డ్రెసింగ్ రూములో ఎలాంటి సమస్యలు లేవన్నాడు. ఇద్దరు పిల్లల తండ్రినైన తనకు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసని రోహిత్ కుండ బద్దలుగొట్టాడు.