తెలంగాణలో ఓ గిరిజన గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్న సినీ హీరో
- కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్న చెరుపల్లి గ్రామస్తులు
- చెరుపల్లిలో తాగు నీటి సమస్య తీర్చేందుకు ముందుకు వచ్చిన నటుడు ఆదిత్య ఓం
- సంక్రాంతిలోపు ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి
సురక్షితమైన మంచినీరు గ్రామస్తులకు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి సంక్రాంతి పండుగ నుంచి ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సురక్షిత తాగు నీరు అందుబాటులోకి వస్తే తమకు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెరుపల్లి గ్రామస్తులు అదిత్య ఓంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఇక ఆదిత్య ఓం సినీ కెరీర్ విషయానికి వస్తే 'లాహిరి లాహిరి లాహిరి' మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన.. గత ఏడాది 'నాతో నేను' మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. ఈ ఏడాది పాప్యులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో సందడి చేశాడు. తాజాగా 'బందీ' మూవీలో ఆదిత్య ఓం నటిస్తున్నాడు.
.