హైటెక్ సిటీ తరహాలో... అమరావతిలో డీప్ టెక్నాలజీ బిల్డింగ్
- నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
- డీప్ టెక్నాలజీ బిల్డింగ్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం
- భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీదేనని వెల్లడి
- సమీక్షకు హాజరైన ఐటీ మంత్రి నారా లోకేశ్
గతంలో హైదరాబాదులో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హైటెక్ సిటీ తీసుకువచ్చామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని, డీప్ టెక్నాలజీతో కలిగే అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ఈ దిశగా అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాగా, ఈ సమీక్ష సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.